- Get link
- X
- Other Apps
బట్టలుతికిన నీళ్ళు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా ?
అవుననే చెప్పాలి . మురికి పట్టిన బట్టల నీటిని అనాలోచితంగా కాళ్ళ మీద పోసుకుంటారు ఆడవాళ్ళు కొందరు . అలా చేయటం వల్ల పుట్టింటికి అరిష్టము . ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ సమాయన్ని నీటిలో ఉంటూ పని చేయటం ద్వారా కాళ్ళకూ , చేతులకూ పగుళ్లోస్తాయి . వందలో తొంభై మధ్య తరగతి వారూ క్రింద తరగతి స్త్రీలలో ఖచ్చితంగా కాళ్ళలో పగుళ్ళు ఆ ఏర్పడతాయి . వారిలో పదిశాతం చదువుకున్న , లేదా అందం పట్ల , ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటారు . అలా జాగ్రత్తలు తీసుకోని మహిళలు గుడ్డలుతికిన నీటిని , మలినమైనవీ , క్రిములున్న నీటిని కాళ్ళపై పోసుకోవటం ద్వారా అనేక క్రిములు శరీరంలోకి ప్రవేశించి , అనారోగ్యాన్ని కలగ చేస్తాయి . అప్పుడు అడ్డం పడితే భర్త పుట్టింటికి పంపిస్తాడు . ఆపై పడేదే పుట్టింటి వాళ్ళేగా బాధలు . కూతురు సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని తల్లీ , తండ్రీ కోరు కుంటారు . అలా కాళ్ళ మీద గుడ్డలుతికిన నీరు పోసుకుంటే పుట్టింటికి అరిష్టమని చెప్త , ఆడపిల్ల పుట్టింటి మీద ప్రేమతో చెయ్యకుండా ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు అలా చెబుతారు .
- Get link
- X
- Other Apps
Comments