- Get link
- X
- Other Apps
వటపత్ర శాయి అనగా ?
మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని . ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది . మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు . ఏడో మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు . వారి నాట్య హొయలకు మార్కండేయుడు చలించలేదు . చలించని మార్కండేయుడికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ' ఏం వరం కావాలో కోరుకో ' అనగా ' నీ మాయను చూడాలని ఉంది ' అని అడగుతాడు . ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలీ , ధారపాత వర్షమూ విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి . నీటితో సమస్తం మునిగిపోతుంది . మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు . అలా తిరుగుతన్న అతనికి ఓ చోట మర్రిఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు . చేతి వ్రేళ్ళతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు . అతడే వటపత్రశాయి . మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై నున్న వటపత్రశాయి కడుపులోకెళ్ళి చూస్తాడు . నీట మునిగిన సమస్త భూమీ , ప్రాణి కోటి కనిపిస్తుంది . మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభము చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు . శ్రీమహావిష్ణువు వరం ప్రకారం విష్ణు మాయను తెలుసుకుంటాడు .
- Get link
- X
- Other Apps
Comments