పుణ్యానికి పోతే పాపం ఎదురయిందని ఎందుకంటారు ?

 పుణ్యానికి పోతే పాపం ఎదురయిందని ఎందుకంటారు ?

మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురివిని కోర్కెపై పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి కర్ణాభరణాలు అడుగుతాడు . దానికి మహారాజు ఒప్పుకొని , అతిథికి అందునా బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యమని తలుస్తాడు . భోజనం చేసి వెళ్ళమని చెబుతాడు పౌష్యుడు . చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు . భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఓ వెంట్రుక కనిపిస్తుంది . దానితో మండిపడి పౌష్యమహారాజును గుడ్డి వాడిని కమ్మని శాపం ఇస్తాడు . ఆ శాపానికి పౌష్యమహారాజు కన్నెర్ర చేస్తాడు . మునివాసం చేసిన వాడవు కదాని గౌరవిస్తే , పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురయిందని నాకే శాపం ఇస్తావా ? అని ప్రతి శాపం ఇస్తాడు . తర్వాత ఇద్దరూ చింతిస్తారు . అదే వేరే గాథ . కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలాగే జరుగుతుంది . మంచి పనయినా తరచి తరచి తగు వ్యక్తులకి చేస్తేనే పుణ్యం .



Comments